నాగేశ్వరరావు చెప్పినా సావిత్రి వినిపించుకోలేదు: జమున

  • సావిత్రికి తండ్రి గైడన్స్ లేదు 
  • తోచిన నిర్ణయాలు తీసుకునేది 
  • జెమినీ గణేశన్  తో సినిమాలు చేసింది
తెలుగు తెరపై మహానటి సావిత్రి అయితే .. ఆ తరువాత స్థానంలో జమున కనిపిస్తారు. ఇద్దరి మధ్య ఎంతో సాన్నిహిత్యం వుంది .. అక్కా .. చెల్లి అని పిలుచుకునే ఆత్మీయత వుంది. అలాంటి జమున తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో .. సావిత్రి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

" వివాహం విషయంలో సావిత్రి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసి నాగేశ్వరరావు ఆమెను వారించారట .. అయినా ఆమె వినిపించుకోలేదు. సావిత్రికి ఆ సమయంలో అవసరమయ్యే తండ్రి గైడన్స్ లేదు. తనకి తోచిన నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేసింది. అదే సమయంలో జెమినీతో కలిసి తమిళ సినిమాల్లో చేసింది.. ఆమె దగ్గర బాగా డబ్బుంది. అందువలన జెమినీ గణేశన్ ఆమెను ట్రాప్ చేశాడేమోనని అనిపిస్తోంది. నాకు సావిత్రితోనే తప్ప ఆయనతో పెద్దగా పరిచయం కూడా ఉండేది కాదు" అంటూ చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
savitri
jamuna

More Telugu News